📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జామ మసీదులో

ఘట్కేసర్, మే 28 (ప్రజావాణి) : ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ జామియా మసీద్ అధ్యక్షులు సందేశం విడుదల చేశారు. పవిత్ర త్యాగానికి, దానధర్మాలకు, మానవతా విలువలకు ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, “బక్రీద్ పండుగ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. త్యాగానికి, విశ్వాసానికి, మానవత్వానికి ప్రతీక. ఈ పవిత్ర పండుగ మనకు పరస్పర ప్రేమాభిమానాలు, సేవా భావం, సోదరభావం, దానగుణం వంటి గొప్ప విలువలను గుర్తు చేస్తుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ ఐక్యతతో, పరస్పర గౌరవంతో జీవించాలని ఈ పండుగ సందేశం ఇస్తుంది” అని పేర్కొన్నారు.

అలాగే సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొని ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నింపాలని కోరుకున్నారు.

“మన సంస్కృతి, సంప్రదాయాలు భిన్నమైనప్పటికీ మనందరం ఒక్కటే అనే భావనను బక్రీద్ పండుగ మరింత బలపరుస్తుంది. పేదలకు సహాయం చేయడం, అవసరమైన వారికి అండగా నిలవడం వంటి గొప్ప సందేశాలను ఈ పండుగ సమాజానికి అందిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని ప్రేమాభిమానాలను పంచుకోవాలి” అని తెలిపారు.

వారు మాట్లాడుతూ, “దేశంలో శాంతి, అభివృద్ధి, ప్రజల మధ్య ఐక్యత మరింత బలపడాలని కోరుకుంటున్నాను. యువత మంచి మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలి. బక్రీద్ పండుగ ప్రతి ఇంట సుఖసంతోషాలు నింపాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular