జనగామకు బస్సు సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్ కు కృతజ్ఞతలు
ఫలించిన ప్రజా ప్రతినిధుల, విద్యార్థుల, నాయకుల కృషి
మద్దూరు సెప్టెంబర్ 15, ప్రజా వాణి,
మండలంలోని లద్నూరు గ్రామంలో ఈ నెల 9న నేరుగా జనగామకు బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు,ఉప సర్పంచ్ శివ కుమార్, పి ఏ సి సి ఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు బాల్ రాజ్, పద్మా రెడ్డి,ఏ బి వి పి నాయకుడు సోగాల మనోజ్ కుమార్, వార్డు సభ్యులు పూల శరత్ కుమార్, మంజుల గోవింద్ ల సంపూర్ణ మద్దతుతో జూనియర్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ధర్నాకు స్పందించిన డిపో మేనేజర్ ఏం. ఉషా మంగళవారం బస్సు పునరుద్ధరణ చేయడంతో విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

