📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల పట్టణ ఆర్ అండ్ బి రోడ్డు పనులపై బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ సమీక్ష సమావేశం

పోరుమామిళ్ల పట్టణ ఆర్ అండ్ బి రోడ్డు పనులపై బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ సమీక్ష సమావేశం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల,(ఆగస్టు 27 ప్రజావాణి) వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం పోరుమామిళ్ల పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమీక్ష సమావేశం జరిగింది. స్థానిక ఆర్ అండ్ బి (రోడ్లు, భవనాలు) రోడ్డు అభివృద్ధి పనుల పురోగతిపై బద్వేల్ రాజశ్రీ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) ఎ.చంద్రమోహన్.పలు ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి ఈ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు.పట్టణంలో సాగుతున్న రోడ్డు పనుల ప్రస్తుత స్థితిగతులను,ఎదురవుతున్న అడ్డంకులను అధికారులను అడిగి తెలుసుకున్న ఆర్డీఓ,పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా,నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.వివిధ శాఖల మధ్య సమన్వయం లోపించడం వల్ల పనులు ఆలస్యం కాకూడదని,అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో పోరుమామిళ్ల తహసిల్దార్ కే.విజయ్ కుమార్,ఎంపీడీవో ఉపేంద్ర రెడ్డి,సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సి.ఐ) హేమ సుందర్ రావు, ఆర్ అండ్ బి అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ప్రసన్న తో పాటు రెవెన్యూ,పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన పలువురు సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ,ఈ అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తామని ప్రకటించారు.ఇందులో భాగంగానే వచ్చే వారం కూడా పైన పేర్కొన్న అధికారులందరితో కలిసి రోడ్డు పనులపై మరోసారి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.