పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
గాయపడిన జిపి సిబ్బంది కృష్ణ
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 16, ప్రజావాణి :
విధి నిర్వహణలో ఇటీవల ప్రమాదానికి గురై గాయపడిన కురవి మేజర్ గ్రామపంచాయతీ సిబ్బంది పాక కృష్ణను గురువారం కాంగ్రెస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. సుమారు 20 రోజుల క్రితం విద్యుత్ స్తంభం ఎక్కే క్రమంలో స్తంభం విరిగి కిందపడటంతో కృష్ణ రెండు చేతులకు గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న కురవి టౌన్ అధ్యక్షుడు నారాయణ రాజేందర్ కుమార్, గార్లపాటి భరద్వాజ్, మండల ఉపాధ్యక్షుడు ఆవిరి మోహన్రావు కృష్ణను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో కురవి మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు దైద భద్రయ్య, మండల నాయకులు శ్యామల శ్రీనివాస్, బండి మల్లయ్య, బీఎల్ఏ సంగెం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

