📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్లలో ఘనంగా జాతీయ వైద్య ఆరోగ్య కార్యక్రమాల సమీక్షా సమావేశం లో: పాల్గొన్న జిల్లా వైద్య...

పోరుమామిళ్లలో ఘనంగా జాతీయ వైద్య ఆరోగ్య కార్యక్రమాల సమీక్షా సమావేశం లో: పాల్గొన్న జిల్లా వైద్య వైద్యాధికారి డాక్టర్ యుగంధర్

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల:(ఆగస్టు 27 ప్రజావాణి) స్థానిక పోరుమామిళ్ల పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ వైద్య ఆరోగ్య క్రమాలపై ఒక సుదీర్ఘమైన,సమగ్రమైన సమీక్షా సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. వైఎస్ఆర్ కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి గౌరవనీయులు డాక్టర్ యుగంధర్ గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత బలోపేతం చేయడం,జాతీయ ఆరోగ్య పథకాల అమలు తీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
సేవలపై సుదీర్ఘ సమీక్ష:
సమావేశంలో భాగంగా పోరుమామిళ్ల, టేకూరుపేట, కలసపాడు, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న వైద్య సేవలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ యుగంధర్ సుదీర్ఘంగా సమీక్షించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, శిశు సంరక్షణ, టీకాల పంపిణీ, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు మరియు ల్యాబ్ పరీక్షల నిర్వహణ వంటి కీలక అంశాలపై వైద్యాధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందేలా నిరంతరం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.
పాల్గొన్న ముఖ్య అధికారులు:
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ వైద్య అధికారులు మరియు ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు. వారిలో:

* జిల్లా రోగనిరోధక పట్టిక అధికారి డాక్టర్ J. ప్రవీణ్ కుమార్,
* ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆరీఫ్,
* జిల్లా మలేరియా అధికారి
* బద్వేల్ తాలూకా డిప్యూటీ  డాక్టర్ మల్లేష్,
* డీపీఎం  నారాయణపాల్గొన్నారు.

హాజరైన వివిధ పి.హెచ్.సి వైద్యాధికారులు:వివిధ మండలాల నుంచి వచ్చిన వైద్యాధికారులు తమ పరిధిలోని ఆరోగ్య నివేదికలను సమర్పించారు:

* కలసపాడు: వైద్యాధికారులు డాక్టర్ శైలజ, డాక్టర్ సాయితేజ
* టేకూరుపేట: వైద్యాధికారులు డాక్టర్ మేరీ ఎలీషా,డాక్టర్ జయరాం,
* నరసాపురం: వైద్యాధికారులు డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ పుష్ప,సిబ్బంది విస్తృత భాగస్వామ్యం:
ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులతో పాటు క్షేత్రస్థాయిలో సేవలందించే సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సిహెచ్ఓలు, డిప్యూటీ హెచ్ఈఓ సాధు వెంకటేశ్వర్లు,పోరుమామిళ్ల సబ్-యూనిట్ ఆఫీసర్ టి. నరసింహా రెడ్డి, కడప సబ్-యూనిట్ ఆఫీసర్ సూపర్‌వైజర్ రాఘవ,వెంకటేశ్వర్లు, కడప అర్బన్ ఎస్‌యుఓ ఎం.వి.వి.ప్రసాద్, హాజరయ్యారు.వీరితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన హెల్త్ సూపర్‌వైజర్లు,ఏఎన్‌ఎంలు,ఎంఎల్‌హెచ్‌పీలు,ఎంపీహెచ్ఏ,మరియు ఆశా,కార్యకర్తలు,ఇతర వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేశారు.ప్రజారోగ్య పరిరక్షణలో సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి,జిల్లాను ఆరోగ్య రంగంలో ముందుంచాలని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.