బావిలో పడి వృద్ధురాలు మృతి
రేగొండ, మే 15 (ప్రజావాణి ):- జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన బండి ఓదమ్మ w/o రాజా మొగిలి 67 సంవత్సరాలుపోలీసుల వివరాల ప్రకారం మృతురాలికి గత ఎనిమిది నెలల నుండి అనారోగ్య సమస్యలతో,కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో అందరూ భోజనం చేసి పడుకున్న తర్వాత తేదీ 15 5 2025 రోజున ఉదయం మూడున్నర మృతురాలు కోడలు ఇంట్లో చూసేసరికి మృతురాలు కనబడబోయేసరికి మృతురాలు కోడలు కొడుకు బంధువులు చుట్టుపక్కల వెతకగా రేపాక గ్రామ శివారులోని పైడిపల్లి ఓదెలు వ్యవసాయ బావిలో పడి చనిపోయి ఉన్నది మృతురాలు కడుపునొప్పి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితం పై విరక్తి చెంది బావిలో పడి ఉదయం ఐదున్నర గంటల సమయంలో చనిపోయినది మృతురాలు మరణం పై ఎవరిపై ఎటువంటి అనుమానం లేదని ఫిర్యాదుదారుడు మృతురాలి కొడుకు బండి సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి సుధాకర్ గారు తెలిపినారు




