📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్హత్య కేసు ఛేదింపులో ప్రతిభ: డీఎస్పీ ఆఫీస్ క్రైమ్ పార్టీ అమర్నాథ్ రెడ్డికి క్యాష్ రివార్డు

హత్య కేసు ఛేదింపులో ప్రతిభ: డీఎస్పీ ఆఫీస్ క్రైమ్ పార్టీ అమర్నాథ్ రెడ్డికి క్యాష్ రివార్డు

📰 Generate e-Paper Clip

మైదుకూరు,ఆగస్టు 28 (ప్రజావాణి):కలసపాడు మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసును ఛేదించడంలో మరియు నిందితులను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరిచిన మైదుకూరు డీఎస్పీ ఆఫీస్ క్రైమ్ పార్టీ సిబ్బంది అమర్నాథ్ రెడ్డి,ని డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ప్రత్యేకంగా అభినందించి, క్యాష్ రివార్డు (నగదు పురస్కారం) అందజేశారు.
నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో కీలక పాత్ర
ఎకరా 30 సెంట్ల భూవివాదం కారణంగా,రూ. 6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ క్లిష్టమైన హత్య కేసును ఛేదించడంలో క్రైమ్ పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి. కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో నిందితుల కదలికలపై నిఘా ఉంచి,వారిని చాకచక్యంగా బంధించడంలో దర్యాప్తు బృందానికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించారు. ఆయన ఎంతో శ్రద్ధతో, కష్టపడి పనిచేసి కేసును శరవేగంగా కొలిక్కి తీసుకురావడానికి తోడ్పడ్డారు.
డీఎస్పీ చేతుల మీదుగా పురస్కారం
అమర్నాథ్ రెడ్డి చూపిన అంకితభావం,సమయస్ఫూర్తిని డీఎస్పీ రాజేంద్రప్రసాద్, కొనియాడారు. ఈ సందర్భంగాఅమర్నాథ్ రెడ్డి, కి డీఎస్పీ చేతుల మీదుగా క్యాష్ రివార్డు మరియు అభినందన పత్రాన్ని అందజేశారు.నేరాల అదుపులో మరియు నిందితులను పట్టుకోవడంలో క్రైమ్ పార్టీ సిబ్బంది అందించే ఇలాంటి చొరవ పోలీస్ శాఖకే గర్వకారణమని డీఎస్పీ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.