📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్లలో అనుమతులు లేని ల్యాబ్‌ల గుట్టురట్టు: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ‘సాయి లీల’ నెట్‌వర్క్!* (పోరుమామిళ్ల -ప్రజావాణి న్యూస్ ప్రత్యేక కథన )

పోరుమామిళ్ల: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లలో నిబంధనలకు పాతరేస్తూ,ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్యాథాలజీ ల్యాబ్‌ల బాగోతం బట్టబయలైంది.పట్టణానికి చెందిన నాగేంద్ర అలియాస్ సాయి లీల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రధాన ల్యాబ్‌తో పాటు ఆయనకు అనుబంధంగా ఉన్న మరో నాలుగు ఆసుపత్రుల ల్యాబ్‌లలో దారుణమైన అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ నిబంధనలు,కనీస అర్హతలు లేకుండా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఈ దందా సాగుతోంది.
1. పర్మిషన్లు లేవు… బోర్డులు మాత్రమే ఉన్నాయి!
మెడికల్ ల్యాబ్ (Diagnostic Center) నిర్వహించాలంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DM&HO) నుంచి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి.కానీ,నాగేంద్ర అలియాస్ సాయి లీల హాస్పిటల్ పరిధిలోని ల్యాబ్‌కు గానీ,ఆయన మేనేజ్ చేస్తున్న మిగిలిన 4 ఆసుపత్రుల ల్యాబ్‌లకు గానీ చట్టబద్ధమైన ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది.అనుమతుల పత్రాలు అడిగితే దాటవేయడం లేదా నకిలీ డాక్యుమెంట్లతో నెట్టుకురావడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది.
2. క్వాలిఫైడ్ డాక్టర్లు లేరు.. టెక్నీషియన్లదే రాజ్యం!
ఒక ల్యాబ్ రిపోర్టు ప్రామాణికంగా మారాలంటే దానికి ఎండీ ప్యాథాలజిస్ట్ (MD Pathologist) సంతకం తప్పనిసరి.కానీ ఈ ఐదు ల్యాబ్‌లలో ఎక్కడా క్వాలిఫైడ్ ప్యాథాలజిస్ట్‌లు లేరు.అరకొర చదువుకున్న ల్యాబ్ అసిస్టెంట్లతో బ్లడ్,యూరిన్ శాంపిల్స్ సేకరించి,మిషన్లలో వచ్చే రీడింగ్స్ ఆధారంగా డిజిటల్ సంతకాలతో రిపోర్టులు సృష్టించి రోగులకు అంటగడుతున్నారు.ఈ తప్పుడు రిపోర్టుల వల్ల రోగులకు ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నా లేనట్లు, లేకపోయినా ఉన్నట్లు చూపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు.
3. ఐదు ల్యాబ్‌ల సిండికేట్.. దోపిడీ నెట్‌వర్క్!
ఒక ప్రధాన కేంద్రం,దానికి అనుబంధంగా మరో 4 ఆసుపత్రుల ల్యాబ్‌లు.ఇదంతా ఒక గొలుసుకట్టు వ్యాపారంలా సాగుతోంది.ఈ ల్యాబ్‌ల మధ్య అంతర్గత ఒప్పందాలు ఉన్నాయి. సాధారణ రోగులను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తిప్పుతూ,అవసరం లేని డజన్ల కొద్దీ టెస్టులు రాస్తూ అమాయక ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కమీషన్ల కక్కుర్తి కోసం డాక్టర్లు,ల్యాబ్ నిర్వాహకులు చేతులు కలిపి ఈ దోపిడీకి తెరలేపారు.
4. కనీస బయో-మెడికల్ వ్యర్థాల నిర్వహణ లేదు
ఈ అక్రమ ల్యాబ్‌ల నుండి వెలువడే బయో-మెడికల్ వ్యర్థాలను (ఉపయోగించిన సిరంజీలు,బ్లడ్ వైల్స్, నీడిల్స్) నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయడం లేదు. వీటి వల్ల పోరుమామిళ్ల స్థానికులకు కొత్త అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది.కాలుష్య నియంత్రణ మండలి (APPCB) నిబంధనలను ఈ ఐదు కేంద్రాలు పూర్తిగా కాలరాస్తున్నాయి.
ప్రజాలు డిమాండ్ మరియు అధికారుల స్పందన కరవు:
ఇంత పెద్ద ఎత్తున అనుమతులు లేకుండా దందా సాగుతున్నా స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది మిస్టరీగా మారింది.ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పోరుమామిళ్లలోని నాగేంద్ర అలియాస్ సాయి లీల ల్యాబ్‌పై మరియు ఆయనకు సంబంధించిన మిగిలిన నాలుగు ఆసుపత్రి ల్యాబ్‌లపై ఆకస్మిక దాడులు (Surprise Raids) నిర్వహించాలి.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి నకిలీ, అనుమతులు లేని ల్యాబ్‌లను తక్షణమే సీజ్ చేయాలి. లేనిపక్షంలో పోరుమామిళ్ల ప్రజల ఆరోగ్య భద్రత గాల్లో దీపంగా మారే ప్రమాదం ఉంది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.