పోరుమామిళ్ల పోలీస్ సెప్టెంబర్ 14 ప్రజావాణి సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ (సి.ఐ) హేమ సుందర్ రావు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలను తొలగించి, సకల శుభాలను, విజయాలను ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలు పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండలాల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సంతోషంగా, ఆరోగ్యంగా మరియు ఐక్యతతో జరుపుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ హేమ సుందర్ రావు, సర్కిల్ పరిధిలోని ప్రజలకు, యువతకు మరియు వినాయక మండపాల నిర్వాహకులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. పండుగ ఉత్సవాలను అందరూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తుచేశారు.ముఖ్యంగా వినాయక మండపాల వద్ద ఏర్పాటు చేసే సౌండ్ సిస్టమ్స్, డిజేల (DJs) విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు., సుప్రీంకోర్టు మరియు పోలీసు శాఖ నిబంధనల ప్రకారం అనుమతించిన సమయాల్లో మాత్రమే మైకులు ఉపయోగించాలని ఆదేశించారు.నిబంధనలను అతిక్రమించి మితిమీరిన శబ్దాలతో ఇతరులకు,ముఖ్యంగా వృద్ధులు,రోగులు మరియు విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. నిబంధనలను పాటించడం ద్వారా పండుగ శోభను, దైవత్వాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. “మీ భద్రతే మా ప్రాధాన్యం” అని పేర్కొంటూ, పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ, భక్తిభావంతో వినాయక చవితి వేడుకలను విజయవంతం చేయాలని పోరుమామిళ్ల సర్కిల్ పోలీస్ శాఖ తరఫున ఇన్స్పెక్టర్ హేమ సుందర్ రావు మరొకసారి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జరుపుకోవాలి: పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ సుందర్ రావు పిలుపు
RELATED ARTICLES

