**పార్టీ బలోపేతంతో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి **
బెజ్జంకి, సెప్టెంబర్ 4 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డిని బీజేపీ కిసాన్ మోర్చా హనుమకొండ జిల్లా ఇంచార్జిగా నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిపాల్ రెడ్డిని అభినందించారు.ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. రైతుల సమస్యల పరిష్కారం, రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా హనుమకొండ జిల్లాలో బీజేపీ, కిసాన్ మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

