తాళ్లపల్లి జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారం పంపిణీ…
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 9. ప్రజావాణి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి జిల్లా పరిషత్. మండల పరిషత్ పాఠశాలలకు విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందించిన యూనిఫారాలను తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్ చేతుల మీదుగా బుధవారం యూనిఫారాల.కార్యక్రమం చేపట్టారు. అనంతరం గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్ మాట్లాడుతూ. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పాఠశాలల విద్యార్థులకు దాతలు ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాధవాచారి. శ్రావణ్ కుమార్. తమ్మలి జయమ్మ. గ్రామ సెక్రెటరీ నాగరాజు. జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు కిరణ్మయి. మండల పరిషత్ టీచర్లు. ప్రధానోపాధ్యాయులు. జిల్లా పరిషత్ టీచర్లు. మరియు తాళ్లపల్లి గ్రామ పెద్దలు యువకులు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.

