📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్లలో ఘోర ప్రమాదం: ఒకరి మృతి.. అధికారుల ఉదాసీనతకు బలైన అమాయక ప్రాణం!

పోరుమామిళ్లలో ఘోర ప్రమాదం: ఒకరి మృతి.. అధికారుల ఉదాసీనతకు బలైన అమాయక ప్రాణం!

📰 Generate e-Paper Clip

* ఫుట్‌పాత్‌ల ఆక్రమణలే శాపంగా మారిన వైనం

* పట్టించుకోని పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ యంత్రాంగం

* ప్రాణాలు పోతున్నా రాని మెలకువ.. ప్రజల ఆగ్రహం

పోరుమామిళ్ల, ఆగస్టు 14:ప్రజావాణి స్థానిక అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల కారణంగా పోరుమామిళ్ల పట్టణంలో ఒక అమాయక ప్రాణం గాల్లో కలిసిపోయింది. పట్టణంలోని గాజుల టీ అంగడి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శీనప్ప బావి వీధికి చెందిన మస్తాన్ (37) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.ప్రమాదం జరిగింది ఇలా.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.మస్తాన్ గాజుల టీ అంగడి సమీపంలో రోడ్డు దాటుతుండగా,మైదుకూరు వైపు వెళ్తున్న ఐచర్ వాహనం అతి వేగంగా, అజాగ్రత్తగా వచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది. వాహనం వేగానికి మస్తాన్ శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి.చేతికి, ఛాతి భాగానికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే స్పందించి 108 ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మస్తాన్ మరణవార్త వినగానే కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పదే పదే హెచ్చరించినా పెడచెవిన పెట్టిన అధికారులు!

పోరుమామిళ్ల పట్టణంలో ప్రధాన రహదారుల పక్కన ఉన్న ఫుట్‌పాత్‌లు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. పాదచారులు నడవడానికి వీలు లేకుండా చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్లు, వ్యాపార సముదాయాల బోర్డులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించేశాయి. దీనివల్ల ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రధాన రహదారిపై నడవాల్సి వస్తోంది.ఈ ప్రమాదకర పరిస్థితిపై గతంలో విలేకరులు, పౌర సమాజం ఎన్నో కథనాలు రాశారు. “ఫుట్‌పాత్‌లను క్లియర్ చేయండి, పాదచారులకు రక్షణ కల్పించండి” అని పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా, అధికారులలో చలనం రాలేదు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం!

అధికారుల ఉదాసీనత వల్లే ఈరోజు ఒక ప్రాణం పోయిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలేకరులు పదే పదే హెచ్చరించినప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు, ఇప్పుడు ఒకరి ప్రాణం పోయాక ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో అధికారులు చలగాటమాడుతున్నారని, ఒకరి ఇల్లు చీకటయ్యాక గానీ అధికారులకు మెలకువ రాలేదా అని ప్రజలు నిలదీస్తున్నారు.ఇలాంటి ఘోర ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వీడాలి.1.ఆక్రమణల తొలగింపు: ప్రధాన రహదారి మరియు ఫుట్‌పాత్‌లపై ఉన్న అక్రమ షాపులు, తోపుడు బండ్లను తక్షణమే క్లియర్ చేయాలి.2.పాదచారులకు దారి: ప్రజలు సురక్షితంగా నడవడానికి వీలుగా ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తేవాలి.3.కఠిన చర్యలు: నిబంధనలు ఉల్లంఘించి రోడ్లను ఆక్రమించే వారిపై కఠినమైన జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పోరుమామిళ్ల రోడ్లను ఆక్రమణల నుంచి విముక్తి చేయాలని పట్టణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.