కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేదింటికల నిజమైన వేళ…
పోతుగల్ ప్రజావాణి ఆగస్టు 16, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలోని పెద్ద తండాలో కేతవత్ మంగమ్మ కేతావత్ నరేందర్ గారి ఇందిరమ్మ నూతన ఇంటి గృహప్రవేశానికి షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంటారెడ్డి మరియు పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా నర్సింహులు నూతన గృహప్రవేశానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, గ్రామ సర్పంచ్ పామేనా,నర్సింలు నూతన గృహప్రవేశం అనంతరం షాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంటారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ముఖ్యంగా పేద ప్రజలకు ఇండ్లు మంజూరు చేసి కట్టించడం ఎంతో సంతోషకరమని ఆయన అభిప్రాయపడ్డారు, రాష్ట్రంలో పేద ప్రజలకు చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి కి అద్దం పడుతున్నారని వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పెంటా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నేరెట్ల రాజు పోతుగల్ గ్రామ మాజీ సర్పంచ్ కేతావత్ రవీందర్ నాయక్, పోతుగల్ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఒగ్గు నరేష్, షాబాద్ మల్లేష్ వార్డు సభ్యులు కుమ్మరి చంద్రశేఖర్ మూడవ గోపాల్ ఇస్లావత్ తారా సింగ్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,


