📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఒకే వార్డెన్.. మూడు హాస్టళ్లు! ఎక్కడ ఈయన హాజరు? విద్యార్థుల భవిష్యత్తుతో అధికారుల చెలగాటం!

ఒకే వార్డెన్.. మూడు హాస్టళ్లు! ఎక్కడ ఈయన హాజరు? విద్యార్థుల భవిష్యత్తుతో అధికారుల చెలగాటం!

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల జూలై 12 ప్రజావాణి మూడు వసతి గృహాలు కలసపాడు లోని సాంఘిక సంక్షేమ బాయ్స్ హాస్టల్,పోరుమామిళ్లలోని,ఎస్సీ సాంఘిక సంక్షేమ బాయ్స్ హాస్టల్,పోరుమామిళ్ల బీసీ సంక్షేమ హాస్టల్
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ప్రభుత్వ విద్యార్థి వసతి గృహానికి (హాస్టల్‌కు) ఒక పూర్తిస్థాయి వార్డెన్ ఉండాలి. వందలాది మంది పేద విద్యార్థులు ఉండే హాస్టళ్లలో వారి బాగోగులు చూసుకోవడానికి, నాణ్యమైన భోజనం అందుతుందో లేదో పర్యవేక్షించడానికి వార్డెన్ వ్యవస్థ అత్యంత కీలకం.కానీ,వైఎస్ఆర్ కడప జిల్లాలోని కలసపాడు,పోరుమామిళ్ల మండలాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నిబంధనలను తుంగలో తొక్కి, ఏకంగా మూడు హాస్టళ్లకు ఒకే వార్డెన్‌కు అదనపు బాధ్యతలు (ఇన్‌చార్జ్) అప్పగించడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.ప్రతి హాస్టల్‌కు ఒక వార్డెన్ ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి,ఒకే వ్యక్తికి మూడు చోట్ల బాధ్యతలు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేమిటి?ఆ వార్డెన్ అసలు ఎక్కడ విధులకు హాజరవుతున్నారు? విద్యార్థుల పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? అనే ప్రశ్నలపై’ప్రత్యేక విచారణాత్మక కథనం’.మూడు హాస్టళ్లు – ఒక్కడే బాధ్యుడు: అసలు కథ ఏంటి?ప్రభుత్వ రికార్డుల ప్రకారం [కలసపాడు ప్రభుత్వ హాస్టల్],పోరుమామిళ్ల ప్రభుత్వ హాస్టళ్లకు వేర్వేరుగా అధికారులు ఉండాలి.కానీ,ఉన్నతాధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్న సదరు వార్డెన్, నిబంధనలకు పాతర వేస్తూ మూడు హాస్టళ్లకు తానే సర్వాధికారిగా చలామణి అవుతున్నారు.

మొదటి ప్రశ్న: ఒకే సమయంలో ఒక వ్యక్తి వేర్వేరు మండలాల్లో ఉన్న మూడు వేర్వేరు హాస్టళ్లలో ఎలా అందుబాటులో ఉండగలరు?
రెండూ ప్రశ్న బయోమెట్రిక్ హాజరు నిబంధనలు కఠినంగా ఉన్న ఈ రోజుల్లో, ఈయన గారు రోజుకు ఏ హాస్టల్‌లో వేలిముద్ర వేస్తున్నారు? మిగిలిన రెండు హాస్టళ్లలో హాజరును ఎలా మేనేజ్ చేస్తున్నారు ?
గాలికి దీపంలా విద్యార్థుల భద్రత – పర్యవేక్షణ శూన్యం!
వార్డెన్ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది.

1.మెనూ అటకెక్కింది: ప్రతిరోజూ విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందాల్సి ఉంది. కానీ వార్డెన్ నిరంతరం గైర్హాజరు కావడంతో వంట సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
2.భద్రత కరువైంది:రాత్రి వేళల్లో విద్యార్థులకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా,అత్యవసర పరిస్థితి ఎదురైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
3.రికార్డుల మాయాజాలం:సదరు వార్డెన్ కేవలం సంతకాలకు, బిల్లుల క్లియరెన్స్‌కు మాత్రమే హాస్టళ్లకు వస్తున్నారని,విద్యార్థుల సంఖ్యను రికార్డుల్లో ఎక్కువగా చూపిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హాజరు ఎక్కడ? ఏ మండలంలో ఉంటారు?
కలసపాడు, పోరుమామిళ్ల మధ్య కిలోమీటర్ల దూరం ఉంది.ఒకే రోజు ఈ మూడు హాస్టళ్లను సందర్శించడం ఏ అధికారికి సాధ్యం కాదు. సదరు వార్డెన్ తన సొంత ప్రయోజనాల కోసం లేదా ఉన్నతాధికారులతో ఉన్న “ఆర్థిక లావాదేవీల”బంధంతోనే ఈ మూడు పోస్టులను చేజిక్కించుకున్నారని సమాచారం.ఉదయం ఒక చోట,మధ్యాహ్నం ఒక చోట అంటూ రికార్డుల్లో చూపిస్తూ,అసలు ఏ ఒక్క హాస్టల్‌లోనూ పూర్తి సమయం కేటాయించడం లేదన్నది నగ్నసత్యం. దీంతొ ప్రభుత్వ బయోమెట్రిక్ హాజరు విధానానికే ఆయన పెద్ద తూట్లు పొడుస్తున్నారు.
ఉన్నతాధికారుల మౌనం.. పలు అనుమానాలు!
ఈ అక్రమ డిప్యుటేషన్లు లేదా ఇన్‌చార్జ్ బాధ్యతలపై జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు తెలియదా? అంటే ఖచ్చితంగా తెలిసే జరుగుతోందని క్షేత్రస్థాయి పరిశీలనలో అర్థమవుతోంది.అర్హులైన ఇతర అధికారులు ఉన్నప్పటికీ,లేదా కొత్తవారిని నియమించకుండా ఒకే వ్యక్తికి మూడు హాస్టళ్లను కట్టబెట్టడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి కోణం దాగి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.”ప్రతి హాస్టల్‌కు ఒక వార్డెన్ ఉండాలి” అనే నిబంధనను అమలు చేయాలని స్థానిక ప్రజలు,విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మూడు హాస్టళ్లను ఒకే వార్డెన్‌కు అప్పగించిన జీవోను రద్దు చేసి,తక్షణమే పూర్తిస్థాయి అధికారులను నియమించాలని కోరుతున్నారు.ఉన్నతాధికారులు స్పందించి సదరు వార్డెన్ హాజరుపై,హాస్టల్ నిధుల ఖర్చుపై సమగ్ర విచారణ జరపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.