మృగశిర కార్తె శుభాకాంక్షలు*l
కేశంపేట మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి
షాద్ నగర్ ప్రజావాణి జూన్ 08:
మృగశిర కార్తె సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలకు మరియు కేశంపేట మండల ప్రజలకు కేశంపేట మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మృగశిర కార్తె తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్ట స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ప్రకృతి అనుగ్రహంతో మంచి వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరారు. మృగశిర కార్తె ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మృగశిర కార్తె శుభాకాంక్షలు
RELATED ARTICLES




