తల్లిపాలు బిడ్డకు సంజీవని
.గిరిజన కాలనీ లో తల్లిపాల వారోత్సవాలు
గోవిందరావుపేట/ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఆగస్టు 1 నుండి 7 వరకు గిరిజన కాలనీ AWC కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వార్డు మెంబర్ జ్యోతి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్లు బాలింతలకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా అవగాహన కల్పించారు.
తల్లిపాలు బిడ్డకు సంజీవనిగా పనిచేస్తాయని, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తల్లులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ K. పద్మావతి, HM. పోతురాజు, టీచర్ మంజుల మేడం తదితరులు పాల్గొన్నారు.


