డ్రగ్స్ కు దూరంగా ఉండండి,…
మంచి జీవితాన్ని కాపాడుకోండి,… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
డ్రగ్స్ కు నో చెప్పండి,…
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడండి,…
పాల్వంచ సోషల్ వెల్ఫేర్ కళాశాల సి ఓ ఇ ప్రిన్సిపాల్…అన్వేష్ రాజు
పాల్వంచ మండలం (ప్రజావాణి) జూన్ 23,…
డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, మాదకతవ్యాల వినియోగం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ అన్నారు. మంగళవారం పాల్వంచలోని సి ఓ ఈ కళాశాల ప్రిన్సిపాల్ అన్వేష్ గారి అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాలకు హాజరయ్యారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సమాజ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలన్నారు. విద్యార్థులు యువకులు చెడు,వ్యసనాలకు దూరంగా ఉండి మంచి ఆరోగ్యావంతమైన జీవితాన్ని అలవర్చుకోవాలన్నారు. డ్రగ్స్ విక్రయం, రవాణా, వినియోగం, చట్టరీత్య నేరమన్నారు. కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. పిల్లల యొక్క క్రమశిక్షణను చూసి కళాశాల ప్రిన్సిపాల్ ను అభినందించారు. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. గంజాయి కొకెన్ హేరియన్ వంటి చెడు వ్యసనాలకు యువతదూరంగా ఉండాలి అన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే శిక్షలు కట్టిన తరంగా ఉంటాయన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అన్నారు కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అన్వేష్ గారు, పాల్వంచ సీఐ, ఎస్ఐ మరియు కళాశాల బోధన , బోధనేతరసిబ్బంది పాల్గొన్నారు







