ఘట్కేసర్ : మల్కాజ్గిరి సీపీ ఆదేశాల మేరకు ఘట్కేసర్లోని సన్షైన్ పార్క్లో భద్రతా అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేడిపల్లి డివిజన్ ఏసీపీ మోహన్ పాల్గొని తాను మాట్లాడుతూ, ఇండ్లలో పని చేస్తున్న గృహ సహాయకులు, కార్మికులు మరియు ఇతర సిబ్బంది యొక్క పూర్తి వివరాలను స్థానిక పోలీసులకు అందజేయాలని నివాసితులను కోరారు.
సమాజ భద్రత కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ ఎస్ హెచ్ ఓ బాలస్వామి, సెక్టార్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి, సన్షైన్ పార్క్ ప్రెసిడెంట్తో పాటు కాలనీ నివాసితులు పాల్గొన్నారు.




