📄 ePaper
Thursday, July 9, 2026
📄 ePaper
HomeతెలంగాణRajanna Sircillaఅనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం


*–కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.*


*–గాయపడిన వారిని వేములవాడ ప్రభుత్వ అసుపత్రికి తరలింపు.*



*–క్షతగాత్రులను పరమర్శించిన ఎమ్మెల్యే అది శ్రీనివాస్.*


*–పూర్తి వివరాలు తెలియాల్సింది.*



*//వేములవాడ// జులై – 9 (ప్రజావాణి) ఆర్. సి. ఇంచార్జ్. తాటిపల్లి నరసింహస్వామి.*
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అర్బన్ మండలం అనుపురం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిరిసిల్ల నుండి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందినట్లు సమాచారం. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా తెలిసింది.ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిని వెంటనే వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

*పరామర్శించిన ఎమ్మెల్యే అదిశ్రీనివాస్*

అనుపురం వద్ద జరిగిన ప్రమాదం సమాచారం అందుకున్న వేములవాడ ఎమ్మెల్యే అదిశ్రీనివాస్ హుటాహుటిన అసువత్రికి చేరుకొని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఘటనకు సంబదించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular