మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భముగా అంకుషాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అంకుషాపూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ చింతకింది బాలమని వేణు మరియు హ్యూమన్ రైట్స్ నేషనల్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్ గోపాల్ రెడ్డి పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమసమాజ స్వాప్నికుడు, మహా దార్శనికుడు.. పీడీత ప్రజల విముక్తి ప్రదాత డా బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి వినమ్ర నివాళులు అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం తపించిన మహానేత.. భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతి కి మాఘన నివాళులు అని
సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బండారి రాందాస్ కడపోల బిక్షపతి అర్థ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంకుషాపూర్ లో ఘనంగా 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు
RELATED ARTICLES
