నేడు చిగురుమామిడిలో కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్
చిగురుమామిడి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి
మన ప్రజావాణి ప్రతినిధి
(చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో నేడు అనగా మార్చి 08, 2026 (ఆదివారం) ఉదయం 10:00 గంటలకు మాజీ జెడ్పిటిసి సభ్యులు గీకూరు రవీందర్ గారి నివాసంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు తదితర విషయాలపై ముఖ్యమైన ప్రకటనలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.కావున ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పార్టీ నాయకులు హాజరు కావాలని అన్నారు



