*మాజీ కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి):
జనగామ పట్టణ కేంద్రంలోని 30వ వార్డు మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ బోట్ల శ్రీనివాస్ తల్లి బోట్ల చిలకమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా చిలకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాజీ కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్ తో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, చిలకమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు ఉడుగుల కిష్టయ్య, పానుగంటి సువార్త ప్రవీణ్, బిఆర్ఎస్ నాయకులు తిప్పారపు విజయ్, జేరిపోతుల కుమార్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

