పోతుగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం. టెక్స్ బుక్కులను పంపిణీ చేసిన పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా నర్సింలు.
రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 9. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాల విద్యార్థులకు పోతుగల్ గ్రామ సర్పంచ్ పామెన నర్సింల చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు యూనిఫాం మరియు టెక్స్ బుక్ లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా నర్సింహులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పోతుగల్ గ్రామ ఉపసర్పంచ్ నేరెట్ల సావిత్రి. వార్డు సభ్యులు. కేశపల్లి కరుణాకర్ రెడ్డి. విస్లావత్ తారా సింగ్. పాఠశాల నూతన చైర్మన్ వీరంపల్లి మహేశ్వరి. ఐకెపి సిబ్బంది మరియు గ్రామ యువకులు నాగర్ కుంట మహేందర్. ఒగ్గు నరేష్. కేతావత్ పాండు. కేతావత్ సంజీవ ప్రసాద్. తోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ యువజన సంఘాల అధ్యక్షులు ప్రజలు యువకులు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

