📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriపూడూర్–కిష్టాపూర్ వార్డులో డిప్యూటీ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన

పూడూర్–కిష్టాపూర్ వార్డులో డిప్యూటీ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన

📰 Generate e-Paper Clip

పూడూర్–కిష్టాపూర్ వార్డులో డిప్యూటీ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన

రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, శ్మశానవాటిక తదితర ప్రాంతాల పరిశీలన

మేడ్చల్: పూడూర్–కిష్టాపూర్ వార్డు పరిధిలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్‌ మంగళవారం ఉదయం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. టీచర్స్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, బ్రాడ్‌వే కాలనీ, హైటెక్ స్కూల్ రోడ్, అథ్వెల్లి గ్రామం, శాంతా బయోటెక్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, శ్మశానవాటిక, కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్ తదితర మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు. అభివృద్ధి అవసరాలు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించారు.

స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడిన డిప్యూటీ కమిషనర్ వారి సమస్యలు, అవసరాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను నమోదు చేసి, తక్షణ శ్రద్ధ అవసరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన చర్యలను చేపట్టేందుకు క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.