📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఅర్పణపల్లిలో పులి కలకలం

అర్పణపల్లిలో పులి కలకలం

📰 Generate e-Paper Clip

అర్పణపల్లిలో పులి కలకలం
.పాదముద్రలపై అటవీశాఖ తనిఖీలు.
.లభ్యమైనవి అడవి పిల్లి అడుగుజాడల్లా ఉన్నా.. ఇప్పుడే తేల్చి చెప్పలేమన్న అధికారులు?
.పై అధికారుల పర్యవేక్షణలో ల్యాబ్ టెస్ట్ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి.
.ఆందోళన వద్దు.. ప్రజలకు అటవీశాఖ భరోసా.
.కేసముద్రం, ఆగస్టు 18, ప్రజావాణి.
కేసముద్రం మండలంలోని అర్పణపల్లి గ్రామ పరిసరాల్లో ‘పులి’ సంచరిస్తోందంటూ నిన్న వెలువడిన సమాచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ లభ్యమైన కాలి ముద్రలు ప్రాథమికంగా ‘అడవి పిల్లి’ (జంగల్ క్యాట్) అడుగుజాడలను పోలి ఉన్నప్పటికీ.. ఖచ్చితంగా అదే జంతువు అని ఇప్పుడే నిర్ధారించలేమని అధికారులు స్పష్టం చేశారు. పై అధికారుల పర్యవేక్షణలో ఈ పాదముద్రలను ల్యాబ్ టెస్ట్ (శాస్త్రీయ విశ్లేషణ) చేయించిన తర్వాతే పూర్తి నిజానిజాలను గ్రామ ప్రజలకు అధికారికంగా తెలియజేస్తామని అధికారులు వెల్లడించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
*అసలేం జరిగిందంటే..?*
గ్రామ పరిధిలోని కంపార్ట్‌మెంట్ 1134 లో గల భూమి గంధం శ్రీనివాస్ (వార్డు నెంబర్) భూమిని గండికోట కుమార్ కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పొలంలో కోతుల బెడదను నివారించడానికి కుమార్ ప్రతిరోజు అక్కడ ఒక కుక్కను కట్టేస్తుంటాడు. నిన్న సాయంత్రం 5:30పీఎం గంటల ప్రాంతంలో రోజులాగే కుక్కను విప్పడానికి వెళ్లిన కుమార్.. అక్కడ ఒక వన్యప్రాణిని చూసి అది పులి అయి ఉంటుందని భావించాడు. ఈ సమాచారంతో గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
*రంగంలోకి దిగిన అటవీశాఖ.. నిశిత పరిశీలన, ఫోటోల సేకరణ.*
సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు అత్యంత వేగంగా స్పందించారు. బి.యాకూబ్, ఎం. నరేందర్ నేతృత్వంలోని సిబ్బంది మంగళవారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు రాజు, ఉపలయ్య, సూరయ్య, గ్రామస్తులు వార్డు నెంబర్ గంధం శ్రీనివాస్, ముజాహిద్, గండికోట కుమార్‌లతో కలిసి అటవీ ప్రాంతాన్ని, పొలాల గట్లను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో పొలంలో పడిన వన్యప్రాణి కాలి ముద్రలను అధికారులు నిశితంగా పరిశీలించి, ప్రతి కోణంలోనూ ఫోటోలు తీసుకున్నారు.
*ల్యాబ్ టెస్ట్ తర్వాతే తుది నిర్ధారణ..అధికారులు.*
ఈ సందర్భంగా క్షేత్రస్థాయి అటవీ అధికారులు మాట్లాడుతూ…ఈ పాదముద్రలు చూడటానికి అడవి పిల్లి అడుగుల వలె ఉన్నాయి. కానీ, ప్రజల రక్షణే మాకు ముఖ్యం కాబట్టి.. ఖచ్చితంగా అదే జంతువు అని మేము ఇప్పుడే తేల్చి చెప్పలేము. ఈ పాదముద్రల ఫోటోలను, లభ్యమైన ఆధారాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. పై అధికారులు వీటిని ల్యాబ్ టెస్ట్ (శాస్త్రీయ పరీక్షలు) చేయించి, నిపుణులతో విశ్లేషించిన తర్వాతే అది ఏ జంతువు అనే దానిపై పూర్తి స్పష్టత ఇస్తారు. ఆ తుది నివేదిక రాగానే గ్రామ ప్రజలకు స్వయంగా పూర్తి వివరాలు తెలియజేస్తాం. అప్పటివరకు ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు అని భరోసా ఇచ్చారు.అధికారులు స్వయంగా రంగంలోకి దిగడం, శాస్త్రీయంగా పరీక్షలు జరిపి నిజానిజాలు తేలుస్తామని చెప్పడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. వన్యప్రాణుల సంచారంపై ఎలాంటి అనుమానాస్పద సమాచారం వచ్చినా నేరుగా తమకు తెలపాలని అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.