*ఇటిక్యాలలో ఐజెల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన స్వప్న సురేందర్ గౌడ్*
మన సమగ్ర ప్రజావాణి జులై 01
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
అందోల్ మండలంలోని ఎస్. ఇటిక్యాల గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐజెల్ వాటర్ స్టేషన్ను స్వప్న సురేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్లాంట్ను ప్రజలకు అంకితం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రావడం ఆనందదాయక
మని వారు పేర్కొన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామ ప్రజలకు 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.




