ఘట్కేసర్: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కేంద్రీయ విద్యాలయం ఎన్ఎఫ్సీ నగర్ లో 2026–27 విద్యా సంవత్సరానికి 11వ తరగతి కొత్త ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.
సైన్స్, కామర్స్ విభాగాల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నందున అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రవేశాల కోసం పాఠశాల ప్రిన్సిపాల్ను లేదా కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది.
సీట్ల సంఖ్య పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఆసక్తి గల విద్యార్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం పేర్కొంది. ప్రవేశాల ప్రక్రియ, అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు తదితర వివరాల కోసం పాఠశాల కార్యాలయాన్ని లేదా పీజీటీ బి. చిట్టిబాబు (9701803409)ను సంప్రదించాలని సూచించింది.




