బెజ్జంకి, జూన్ 4 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన రచయిత నారోజు శంకరాచారి రచించిన “నా గమ్యం ఐఏఎస్” పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. సివిల్ సర్వీసెస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు మార్గదర్శకంగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర భూమేష్ గౌడ్ కుమార్తె బుర్ర సుచితకు పుస్తకాన్ని అందజేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన ఈ పుస్తకాన్ని ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తూ నారోజు శంకరాచారి విద్యా సేవలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చనే సందేశాన్ని ఈ పుస్తకం అందిస్తోందని గ్రామస్థులు, విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ఐఏఎస్ వంటి అత్యున్నత లక్ష్యాల సాధనకు ప్రేరణనిచ్చే ఈ పుస్తకం మరింత మందికి చేరాలని కోరుతూ పలువురు నారోజు శంకరాచారిని అభినందించారు.




