*చండూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ జ్ఞానోత్సవం*
*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, పుస్తకాల పట్ల అభిరుచిని కలిగించడం లక్ష్యంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గ్రంథాలయ జ్ఞానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గ్రంధాలయాలు విద్యార్థుల మేదస్సును పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి, విద్యార్థులు పుస్తక ప్రదర్శన పుస్తకాల విరాళాల సేకరణ ప్రోత్సహించాలని తెలియజేయడం జరుగుతుంది గ్రంథాలయాల వల్ల ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని వివిధ పుస్తకాలను విద్యార్థులకు పరిచయం చేసి, వాటి ప్రాముఖ్యతను వివరించారు. కథలు, విజ్ఞాన సర్వస్వాలు, జీవిత చరిత్రలు, సాధారణ జ్ఞాన పుస్తకాలను చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని అధ్యాపకులు తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు బాల సైదులు, పద్మజ, జ్యోతి, సునీత, ప్రమీల, సంధ్యా వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.



