నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
తెలంగాణ వీరనారి సంబంధ వర్గాల మేల్కొల్పు గాత్రం సాయుధ పోరాట యోధురాలు విప్లవ మూర్తి నిరంతర స్ఫూర్తి చాకలి ఐలమ్మ గారి 41 వ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ కలం ఐదారి. నాగిళ్ళ శంకర్ నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలకు నిరంత స్ఫూర్తిగా నిలిచినటువంటి చాకలి ఐలమ్మ. ఈ దేశ భవిష్యత్తును పేదరికాన్ని బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని భూమికావాలని నిరుపేద కుటుంబాల్లో వెలుగు నింపాలని ఉద్దేశంతో నిరంతరం బానిసలుగా ఉన్నటువంటి, వారిని పోరాటం చేస్తూ తమ సమస్యలు పరుదయాలని ఉద్దేశంతో, ఉద్యమాలు చేసిందని, వెనుకబడిన వర్గాలకు స్ఫూర్తిగా నిలిచిందని. విప్లవ మూర్తి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వంద అడుగుల విగ్రహాన్ని ట్యాంకుబండ్ పై పెట్టాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ జయంతులను వర్ధంతిని అధికారికంగా చెప్పుకోవడం వరకే మిగిలిందని పూర్తి స్థాయిలో అధికారులు ప్రభుత్వం నిర్వహించడం.లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వీరవనారి ఐలమ్మ యూనివర్సిటీలో చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. త్వరలోనే చాకలి ఐలమ్మ సంఘం ఐదారి కలం రాసినటువంటి ఒడిసెల రాళ్లు పాట రాబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూతరాజు సూర్యం, నాగిళ్ళ భిక్షం, భూతరాజు వెంకన్న, భీమనపల్లి ముత్యం భూతరాజు నరేష్, భూతరాజు యాదగిరి, భూతరాజు ఉదయ్ కుమార్, సంగేపు కోటి ఉన్నారు.

