వినాయక నగర్ కమిటీ ఆధ్వర్యంలోగణపతి కుంకుమ పూజపాల్గొన్న మహిళలు
జమ్మికుంట సెప్టెంబర్ 18 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి వినాకర్ నగర్ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన శ్రీ విగ్నేశ్వర స్వామికి సామూహిక కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించారు నవరాత్రి ఉత్సవాలలో విఘ్నేశ్వర కుంకుమార్చన ఎంతో ప్రాధాన్యంతో కూడుకున్నది కావడంతో శ్రీ వినాయక నగర్ గణపతి కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.ప్రముఖ వేద పండితులు,అర్చక సమాఖ్య కిషన్.మాచార్యులు ఆధ్వర్యంలో కుంకు మార్చన శాస్త్రోక్తంగా జరిపారు కుంకుమార్చనలో భగవత్ భక్తులైన మహిళలతో పాటు,పలువు రు హాజరై కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారుకుంకుమార్చనలతో భక్తులు హాజరై స్వామి వారి కుంకుమ తిలకం ఆశాంతం భక్తి శ్రద్ధలతో తిలకించారు

