బెజ్జంకి, సెప్టెంబర్ 3(ప్రజావాణి)
ఎమ్మార్పీఎస్ బెజ్జంకి మండల ఇంచార్జి చింతకింది పర్శరాములు మాదిగ, నూతన మండల అధ్యక్షుడు జేరుపోతుల మధు మాదిగ, ఎంఎస్పీ బెజ్జంకి మండల ఆధ్యక్షులు వడ్లూరి పర్శరాములు మాదిగ, సీనియర్ నాయకుడు మంకాల ప్రవీణ్ మాదిగ తదితరులు హైదరాబాద్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బెజ్జంకి మండలాన్ని సందర్శించాలని నాయకులు కోరారు.దీనిపై స్పందించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ.. అమరావతిలో నూతన మండల అధ్యక్షులతో నిర్వహించే జాతీయ సమావేశం అనంతరం బెజ్జంకి మండలాన్ని సందర్శిస్తానని తెలిపారు. మాదిగల అభ్యున్నతి కోసం బెజ్జంకిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, సభను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

