📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం: ప్లాస్టిక్ రహిత పట్టణంగా...

పోరుమామిళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం: ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల, సెప్టెంబర్ 20:ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ పిలుపులో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నాడు శానిటేషన్ క్లీన్‌నెస్ (పరిశుభ్రత-ఆరోగ్యం) కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కళాశాల స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ బోయిళ్ళ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ అధ్యక్షత వహించారు.

ఆరోగ్యం, సామాజిక బాధ్యతపై అవగాహన:

కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సొంత ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ వహిస్తారో, పరిసరాల పరిశుభ్రత పట్ల కూడా అంతే బాధ్యత కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, సామాజిక మార్పుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఆకాంక్షించారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తత – సూచనలు:

ప్రస్తుత కాలంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ప్రిన్సిపాల్ సూచించారు. తాము నివసించే ఇళ్లతో పాటు చుట్టుపక్కల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా గ్రామాల్లో, పట్టణ వీధుల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వ్యర్థ పదార్థాలు కుళ్ళిపోయే అవకాశం ఉన్న చోట్ల బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించి దోమలు, క్రిమికీటకాల వ్యాప్తిని అరికట్టాలని శామ్యూల్ డేవిడ్ రాజ్ స్పష్టం చేశారు.పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులంతా కంకణబద్ధులై, ప్రజల్లో చైతన్యం తెస్తూ పోరుమామిళ్లను ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడానికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ ప్రతిజ్ఞను అత్యంత నిష్ఠతో స్వీకరించారు. విద్యార్థులు చేతులు చాచి,తమ పరిసరాలను క్లీన్‌గా ఉంచుతామని ప్రమాణం చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:చైతన్య పూరిత కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రకాశ్ రావు, ఎన్ఎస్ఎస్  కో-ఆర్డినేటర్ చెన్నారెడ్డి, ప్రముఖ అధ్యాపకులు డాక్టర్ సులోచన, డాక్టర్ మల్లిఖార్జున, డాక్టర్ సబిత, చెన్నరాయుడు, డాక్టర్ వెంకట రామిరెడ్డి, యంబడి ఈశ్వరయ్యలతో పాటు ఇతర బోధన, బోధనేతర సిబ్బంది, అలాగే వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కళాశాల ఆవరణలో విద్యార్థులు స్వచ్ఛందంగా శ్రమదానం చేసి వ్యర్థాలను తొలగించడం విశేషం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.