📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పూడూరు ముదిరాజ్ సంఘం వద్ద ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు

పూడూరు ముదిరాజ్ సంఘం వద్ద ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి: జీ. పరమేష్

పూడూరు ముదిరాజ్ సంఘం వద్ద ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు

పూడూరు, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని పూడూరు ముదిరాజ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు జీ. పరమేష్ కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలోని ముదిరాజ్ సంఘం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన పోరాటంలో అమరులైన వారిని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా జీ. పరమేష్ మాట్లాడుతూ.. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కాకపోవడంతో తెలంగాణ ప్రాంత ప్రజలు మరో ఏడాది పాటు ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొన్నారని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందన్నారు.

నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిందని పేర్కొన్నారు. నైజాం పాలనలో రజాకార్ల దురాగతాలు, అణచివేతలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ప్రజలు, ఉద్యమకారులు, పోరాట యోధులు ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛ కోసం అనేకమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు.

విమోచన పోరాట చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, ఆనాటి పోరాటం, త్యాగాలు, చారిత్రక పరిణామాలను ప్రజలకు వివరించే విధంగా నిర్వహించాలని సూచించారు. విమోచన దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి, పోరాట యోధుల సేవలను గుర్తించాలని జీ. పరమేష్ విజ్ఞప్తి చేశారు.

అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, సంఘం సభ్యులు జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. దేశభక్తి, తెలంగాణ విముక్తి పోరాట చరిత్రపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వారు వివరించారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు నీరుడి శ్రీరామ్, పుట్నాల గౌతమ్, మాజీ సర్పంచ్ బాబు యాదవ్, మాజీ ఎంపీటీసీ నీరుడి రఘు, మాజీ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు తుపాకుల కృష్ణ, కోలా వెంకటేష్, శేఖర్ రెడ్డి, సోమేష్, సంఘం సభ్యులు వెంకట్, లచ్చు, నర్సింహా, మర్రిచెట్టు ప్రసాద్, గుడిసె నర్సింహా, కొండ శ్రీనివాస్, మేకల కృష్ణ, తిరుమణి రమేష్, శ్రీనివాస్, సాడే రాజు, నాయకులు అనంత్ రెడ్డి, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.