హైతాబాద్ లో గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు….
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని హైతాబాద్. పంచాయతీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ. యాదయ్యలు. జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ. తెలంగాణ నిజాం నిరంకుశ పాలన నుండి.విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించి న
తొలి హోంమంత్రి ఉక్కుమనిషి.సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో హైతాబాద్ గ్రామపంచాయతీ పాలకవర్గం. సభ్యులు. గ్రామ సెక్రెటరీ మహేందర్. హైతాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. గ్రామ ప్రజలు.యువకులు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


