📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్టిప్పర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టి కార్ డ్రైవర్ మృతి

టిప్పర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టి కార్ డ్రైవర్ మృతి

📰 Generate e-Paper Clip

టిప్పర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టి కార్ డ్రైవర్ మృతి

శామీర్‌పేట–కీసర ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జైన కారు

శామీర్‌పేట–కీసర ఓఆర్ఆర్ మార్గంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిఆర్డిఓ – యాద్గార్‌పల్లి మధ్య శామీర్‌పేట నుంచి కీసర వైపు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఢీకొన్న సమయంలో కారు టిప్పర్ వెనుక భాగంలో బలంగా ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. దీంతో కారులో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అసలు ప్రమాదం ఎలా జరిగింది?

టిప్పర్‌ను కారు ఢీకొట్టడానికి అతివేగమే కారణమా? డ్రైవర్‌కు నిద్రమత్తు లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమా? లేక టిప్పర్ అకస్మాత్తుగా వేగం తగ్గించిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనతో ఓ ఆర్ ఆర్ పై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. పోలీసులు ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను సేకరించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.