గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ
కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా
కాగజ్నగర్: పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథునికి విగ్రహం ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ షాహీన్ సుల్తానా, మాజీ చైర్మన్ దస్తగిరి, కౌన్సిలర్లు సిద్ధం రాజేశ్వరి శ్రీనివాస్, కచ్చకాయల జ్యోతి, ఎమ్మాజీ శారద సంతోష్, వాసిమ్మునిస షబ్బీర్, దుర్గం సూరజ్, కాగజ్నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లాడి రాజు, ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ నహీర్ అలీ వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ
RELATED ARTICLES

