కాల్లెపల్లి రోడ్డుపై పునరుద్ధరించిన రాకపోకలు
వర్షపు నీటితో నిలిచిపోయిన రాకపోకలు- జేసీబీతో మరమ్మతులు
బెజ్జంకి, సెప్టెంబర్ 14 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కాల్లెపల్లి నుంచి బెజ్జంకి వెళ్లే రహదారిలో కల్వర్టు వద్ద వర్షపు నీరు అధికంగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామ సర్పంచ్ బిగుల్లా మోహన్, ఉపసర్పంచ్ వినీత్ గౌడ్, పాలకవర్గ సభ్యులు స్పందించి జేసీబీ సహాయంతో మరమ్మతులు చేపట్టారు.కల్వర్టు వద్ద నీరు వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేయడంతో నీటి ప్రవాహం తగ్గి రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. దీంతో వాహనదారులు, గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.
కాల్లెపల్లి రోడ్డుపై పునరుద్ధరించిన రాకపోకలు
RELATED ARTICLES

