పోచారం ఆగస్టు 30: పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాప్సింగారం గ్రామంలో శ్రీ మహంకాళి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత బోర్డును మాజీ శాసనసభ్యులు మలిపెద్ద సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బద్దం కుమార్, కీసరగుట్ట బోర్డు ట్రస్ట్ సభ్యుడు పాముకుంట్ల ప్రభాకర్ గౌడ్, డివిజన్ వర్కింగ్ మహిళా అధ్యక్షురాలు ఆవేద బేగం, జిల్లా ఓబీసీ సెల్ కన్వీనర్ డేరంగుల బాలరాజు, డివిజన్ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, గ్రామ శాఖ అధ్యక్షుడు గ్యార సురేష్, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ మోర గణేష్, ప్రధాన కార్యదర్శి మల్లేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు మోర దర్శన్ ముదిరాజ్, బుర్ర సాయి గౌడ్, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్, ఉపాధ్యక్షుడు సాయిప్రకాష్, కార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి లక్ష్మీనారాయణ, సాయికిరణ్, సందీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


