నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):
చండూర్ మండలం, మున్సిపాలిటీ లో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చండూర్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో శ్రీదేవి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో యాదగిరి, తహసిల్దార్ కార్యాలయం ముందర ఎమ్మార్వో రమాకాంత్ శర్మ, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై శివకుమార్, హై స్కూల్ గ్రౌండ్లో ప్రధానోపాధ్యాయులు కోటీశ్వర్ రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పాటల వెంకన్న, వివిధ ప్రవేట్ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షుడు భూతరాజు శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐయితరాజు మల్లేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ జాతీయ జెండాలను ఎగురవేశారు. చామలపల్లి గ్రామంలో సర్పంచ్ ముదిగొండ ఆంజనేయులు, మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచులు విద్యార్థులతో జాతీయ గీతాన్ని ఆలపించి, జాతీయ జెండాలు ఎగురవేసి, భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

