రామగుండం,ఆగస్టు 15 ప్రజావాణి :
కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీటి బాలరాజు జన్మదిన వేడుకలు శనివారం గోదావరిఖని చౌరస్తాలో అంగరంగ వైభవంగా జరిగాయి.పార్టీలకు అతీతంగా స్నేహితులు,ఆప్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాలరాజుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అభిమానుల కేరింతలు, శుభాకాంక్షల నడుమ దీటి బాలరాజు జన్మదిన కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా స్నేహితులు, ఆప్తులు పుష్పగుచ్ఛాలు అందించి,శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ “బాలన్నకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని” ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.బాలరాజు జన్మదిన వేడుకలతో గోదావరిఖని చౌరస్తా సందడిగా మారింది. అభిమానులు,స్నేహితుల ఉత్సాహంతో వేడుకలు కోలాహలంగా సాగాయి.

