బెజ్జంకి, ఆగస్టు 27 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేవతి, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ విద్యార్థులకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి విశిష్టతను వివరించారు.
విద్యార్థుల మధ్య ప్రేమ, సోదరభావం, ఆత్మీయతను పెంపొందించేలా వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

