📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మొరబోయిన సుధాకర్

ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మొరబోయిన సుధాకర్

📰 Generate e-Paper Clip



మిర్యాలగూడ, ఆగస్టు 16, ప్రజావాణి న్యూస్: మిర్యాలగూడ పట్టణ పరిధిలోని 9వ వార్డుకు చెందిన మొరబోయిన సుధాకర్ శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్‌లో సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో 9వ వార్డుకు సంబంధించిన పలు సమస్యలతో పాటు ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అభివృద్ధి పనులపై చర్చించారు.

ప్రధానంగా వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పన, స్థానికంగా పరిష్కరించాల్సిన సమస్యలపై మొరబోయిన సుధాకర్ నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే తనకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలను కూడా ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లకు వివరించి, వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని మొరబోయిన సుధాకర్ పేర్కొన్నారు. 9వ వార్డులో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజల సమస్యలను సంబంధిత నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని సుధాకర్ తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లతో పలు స్థానిక అంశాలపై సానుకూలంగా చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్, శ్రీనివాస్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.