📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కళ్ళాపి పొడిలో ప్రాణాంతక రసాయనాలు: ప్రొద్దుటూరులో 19 మంది మృతికి కారణమైన ‘శ్రీసౌభాగ్య కళ్ళాపి పొడి’,...

కళ్ళాపి పొడిలో ప్రాణాంతక రసాయనాలు: ప్రొద్దుటూరులో 19 మంది మృతికి కారణమైన ‘శ్రీసౌభాగ్య కళ్ళాపి పొడి’, కంపెనీల సీజ్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా జూలై 10 ప్రజావాణి ప్రొద్దుటూరులో నిత్యం ఇళ్ల ముందు చల్లే కళ్ళాపి పొడిలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతక రసాయనాలు కలపడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సంప్రదాయబద్ధంగా ఇళ్ల ముందు పేడ నీళ్లకు బదులుగా రంగు కోసం వాడుతున్న ఈ కృత్రిమ కళ్ళాపి పొడి కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏడాదిన్నర కాలంలో ఈ పొడి కలిపిన నీళ్లు తాగి దాదాపు 19 మంది మరణించడంతో రంగంలోకి దిగిన అధికారులు షాకింగ్ నిజాలను వెలుగులోకి తెచ్చారు. 
ఏడాదిన్నరలో 19 మంది బలి
కడప జిల్లా ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ‘శ్రీసౌభాగ్య కళ్ళాపి పొడి’ పేరుతో విక్రయిస్తున్న ఈ రసాయన పొడిని నీళ్లలో కలిపి తాగి గత ఏడాదిన్నర కాలంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.వరుసగా జరుగుతున్న ఈ మరణాలపై అనుమానం వచ్చిన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు,ఆహార భద్రతా అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.ఈ పొడి నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపగా, అందులో ప్రాణాలు తీసే విషపూరిత రసాయనాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. 
పొడిలో తేలిన ‘ఆరమైన్-ఓ’మహమ్మారి
అధికారుల తనిఖీల్లో ఈ కళ్ళాపి పొడి తయారీలో ‘ఆరమైన్-ఓ’అనే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక రసాయనాన్ని విరివిగా వాడుతున్నట్లు గుర్తించారు.సాధారణంగా దీనిని బట్టలకు రంగులు వేసేందుకు  ఉపయోగిస్తారు.నిపుణుల హెచ్చరికల ప్రకారం ఈ రసాయనం మానవ శరీరానికి తీవ్ర హాని కలిగిస్తుంది:
  • క్యాన్సర్ ముప్పు: ఈ రసాయనం కలిపిన పొడిని పీల్చినా,అది చర్మంపై పడినా,లేదా పొరపాటున కడుపులోకి చేరినా క్యాన్సర్ బారినపడే అవకాశాలు చాలా ఎక్కువ.
  • అవయవాల వైఫల్యం: ఇది శరీరంలోకి చేరిన వెంటనే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతింటాయి.
  • తక్షణ మరణం: ఈ పొడి కలిపిన నీటిని తీసుకుంటే అంతర్గత అవయవాలు క్షీణించి తక్కువ సమయంలోనే మరణం సంభవిస్తుంది.రంగంలోకి పోలీసులు.ఐదు తయారీ యూనిట్లు సీజ్ఈ ఘోరం వెలుగుచూడటంతో కడప జిల్లా పోలీసులు ప్రొద్దుటూరులోని ఐదు నకిలీ కళ్ళాపి పొడి తయారీ కేంద్రాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమంగా నడుపుతున్న ఈ ఐదు యూనిట్లను అధికారులు తక్షణమే సీజ్ చేశారు. భారీ ఎత్తున నిల్వ ఉంచిన’శ్రీసౌభాగ్య కళ్ళాపి పొడి’ ప్యాకెట్లను, రసాయనాలను స్వాధీనం చేసుకుని, వీటికి కారణమైన నిర్వాహకులను మరియు యజమానులను అరెస్టు చేసి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక ఉదయాన్నే ఇళ్ల ముందు అందంగా ముగ్గులు వేసేందుకు,కళ్ళాపి చల్లేందుకు మార్కెట్లో దొరికే ఇలాంటి నకిలీ కృత్రిమ రంగుల పొడులను (కృత్రిమ పేడ పొడి) అస్సలు ఉపయోగించవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. మహిళలు ప్రతిరోజూ ఉదయాన్నే ఈ పొడిని చేతులతో తాకడం, నీళ్లలో కలపడం వల్ల శ్వాసకోశ, చర్మ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. సాంప్రదాయబద్ధంగా లభించే సహజ సిద్ధమైన ఆవు పేడను మాత్రమే వాడాలని, ప్రాణాంతకమైన రసాయన పొడులకు దూరంగా ఉండి ప్రాణాలను రక్షించుకోవాలని స్పష్టం చేశారు
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.