📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarకరీంనగర్‌లో దారుణం, పీఎంజే జ్యువెలరీ షాపులో తుపాకులతో దోపిడీ, సిబ్బందిపై కాల్పులు

కరీంనగర్‌లో దారుణం, పీఎంజే జ్యువెలరీ షాపులో తుపాకులతో దోపిడీ, సిబ్బందిపై కాల్పులు

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌లో దారుణం: పీఎంజే జ్యువెలరీ షాపులో

తుపాకులతో దోపిడీ.. సిబ్బందిపై కాల్పులు

కరీంనగర్ బ్యూరో, మే 03 (ప్రజావాణి):

కరీంనగర్ నగరంలో పట్టపగలే జరిగిన ఒక భారీ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఐదుగురు దుండగులు, తుపాకులతో భయాందోళన సృష్టించి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం రద్దీగా ఉన్న సమయంలో ఆయుధాలతో వచ్చిన ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా పీఎంజే జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. ఎవరూ ఊహించని విధంగా వారు షాపు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో పడిన సిబ్బందిని, కస్టమర్లను తుపాకులతో బెదిరించి అదుపులోకి తీసుకున్న దుండగులు, షాపులోని విలువైన బంగారు ఆభరణాలను సంచుల్లోకి నింపుకున్నారు. అనంతరం ఎటువంటి ఆటంకం లేకుండా అక్కడి నుండి పరారయ్యారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో, అది కూడా పగటిపూట నిందితులు అంత ధైర్యంగా కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిందితులు పరారైన దిశగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫోటోల్లో కనిపిస్తున్న దుండగుల గురించి ఎవరికైనా సమాచారం తెలిసినా, లేదా ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ‘డైల్ 100’ కు సమాచారం అందించాలని కోరారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.