EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyగ్రామాల్లో ఐకమత్యాన్ని పెంచే గ్రామ దేవతల పండుగలు: పట్నం అవినాష్ రెడ్డి షాబాద్, మార్చి...

గ్రామాల్లో ఐకమత్యాన్ని పెంచే గ్రామ దేవతల పండుగలు: పట్నం అవినాష్ రెడ్డి షాబాద్, మార్చి 8 (

📰 Generate e-Paper Clip

గ్రామాల్లో ఐకమత్యాన్ని పెంచే గ్రామ దేవతల పండుగలు: పట్నం అవినాష్ రెడ్డి

షాబాద్, మార్చి 8 (ప్రజావాణి): గ్రామ దేవతల పూజలు, పండుగలు, జాతరల వల్ల గ్రామాల్లో ఐకమత్యం మరింత బలపడుతుందని షాబాద్ మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు.

మండలంలోని బోడంపాడ్ గ్రామంలో మైసమ్మ బోనాల సందర్భంగా ఆయన గ్రామస్తులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ దేవతల పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ కలిసి బోనాల పండుగను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి పండుగలు గ్రామ ప్రజల్లో ఐక్యతను పెంచుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమలమ్మ చెన్నయ్య, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు చెన్నయ్య, యాదిరెడ్డి, రాములు, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.