📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయం

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఘట్‌కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular