పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
బెజ్జంకి, ఏప్రిల్ 20(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో నిర్వహించిన పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి-రాజు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే కీ ఘన స్వాగతం పలికారు.అనంతరం పోచమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,లక్ష్మి నర్సింహా స్వామి ఆలయ చేర్మెన్ జెల్ల ప్రభాకార్, ఉపసర్పంచ్ చింతలపల్లి పద్మ గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.



