📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaపొలం పనులు చేస్తూ గుండెపోటుతో రైతు మృతి

పొలం పనులు చేస్తూ గుండెపోటుతో రైతు మృతి

📰 Generate e-Paper Clip

పొలం పనులు చేస్తూ గుండెపోటుతో రైతు మృతి

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన బొమ్మనవేన సమ్మయ్య (60) అనే రైతు సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.
సమ్మయ్య అపస్మారక స్థితిలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ,అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.
సమ్మయ్య మృతితో కుటుంబ సభ్యులు,బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular