📄 ePaper
Wednesday, July 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గుగ్గిళ్ల కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా దూశేట్టి ప్రశాంత్ రెడ్డి

గుగ్గిళ్ల కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా దూశేట్టి ప్రశాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

గుగ్గిళ్ల కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా దూశేట్టి ప్రశాంత్ రెడ్డి

బెజ్జంకి, జూలై 1(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల ఎన్నిక నిర్వహించారు.ఈ ఎన్నికలో దూశేట్టి ప్రశాంత్ రెడ్డిని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏనుకున్నారు.ఈ సందర్భంగా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దూశేట్టి ప్రశాంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.నూతన అధ్యక్షులు దూశేట్టి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular